నా జీవితంలో కుడా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మనకు ఎదురయ్యే ప్రశ్నలేదా మనం అడిగే ప్రశ్నలకు సమాధానం లేకపోయినా పరవాలేదు కానీ అది సరైన ప్రశ్న అవునో కాదో అని మాత్రం మనం ఆలోచిస్తే మనకు సగం బాధలు తీరినట్టే. ఎందుకంటే నేను చాల సార్లు సరిగ్గా ఆలోచించ లేకపోయాను. ఉదాహరణకు నాకు సముద్ర తీరంలో ఉండటం అంటే నాకు చాల ఇష్టం. అందుకే నేను వైజాగ్ వెళ్ళినప్పుడల్లా నేను వైజాగ్ లో నేను ఎందుకు పుట్టలేదా? అని అనుకునేవాడిని. అలాగే తరువాత మా ఊరు వచ్చకా అయ్యో! మా ఊరికి సముద్ర తీరం ఎందుకు లేదు? అని అనుకునేవాడిని. ఇలా చాలా సార్లు సమాధానం లేని నిరుపయోగమైన ప్రశ్నలను సందించుకొని అనవసరంగా బాధ పడుతుంటాం. ఇలాగే ఒక మునీశ్వరుడి దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి " గురువుగారు మంచి వాళ్ళకే ఎందుకు చెడు జరుగుతుంది?" అని అడిగాడట. దానికి ఆ గురువు ఆ ప్రశ్నకి సమాధానం చెబుతూ " ఆ ప్రశ్నే తప్పుగా ఉన్నప్పుడు దానికి నేను జవాబు చెప్పాలని ఎలా అనుకుంటావు. అసలు నీ ప్రశ్న ఇలా ఉండాల్సింది " మంచి వాళ్ళకి చెడు జరిగితే ఏమవుతుంది?, దానికి నేనిచ్చే జవాబు " వాళ్ళు ఇంకా మెరుగైన వాళ్ళల తయారవుతారు" అని ఆ మునీశ్వరుడు చెప్పాడట. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా సరైన ప్రశ్నలతోనే ముందుకు సాగితే సమాధానాలు దొరకక పోయిన కొత్త సమస్యలు మాత్రం రాకుండా ఉంటాయి.
నేను ABN లో 'సిరివెన్నల' గారితో ముఖా ముఖి చుసాను. అయన చిన్నతనం నుండి ఎక్కువుగా తనని తను ప్రశ్నించుకోనేవారట. అందుకే ఆయన రాసిన పాటలు చాలా మందిని ప్రశ్నించే నట్టే ఉంటాయి. 'కొత్త బంగారులోకం' లో రాసిన ఈ పాట చూడండి
నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వారుగా ....
నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించారుగా ....
ఏ గాలో నిన్ను నిన్ను తరుముతుంటే అల్లరిగా...
ఆ గాలో లేదో తెలియదంటే చెల్లదుగా....
పైన చెప్పినట్టు మన జవాబు కోసం ఇంకొకరు స్పందించారు. అందుకే నేను అనుకుంటాను ఏ సమస్యకైన సమాధానం మన అంతరాలాలో నిక్షిప్తమై ఉంటుంది దానిని వెలికితీసే ప్రయత్నమే తెలియక ఈ సమస్యలు. అంటే మామిడి చెట్టు క్రింద నిల్చొని నారింజ పండు కావాలంటే దొరకదు. అందుకే ఏ పండు (సమాధానం) కావాలో మనకు తెలిసినప్పుడు అది ఎక్కడ ఉందొ ముందు వెతకాలి, ఆ తరువాత దానిని మన చేతికి ఎలా చేజిక్కుంచుకోవలో మార్గం కనుగొనాలి.
అన్ని పైన చెప్పినట్టే చేసి ముందుకు పోయిన ఫలితం లేదు, అలాగే దాని వలన కలిగిన బాధ తప్పదు. దీనికి నేను ఏకీభవించినప్పటికీ, ఇక్కడ బాధపడటం సంతోషమర్గాన్ని వెతుక్కోవడమే మిన్న. ఈ సందర్భంలో కూడా నేను 'సిరివెన్నల' గారి పాటను గుర్తుచేయకుండా ఉండలేకపోతున్నాను.
"ఎండలను దండిస్తామా, వానలను నిందిస్తామా
చలినేతో తరిమేస్తామా ఛీ పోమ్మని
కస్సుమని కలహిస్తమా, ఉస్సురని విలపిస్తామా
రోజులతో రాజీపడమా సర్లేమ్మనీ, సాటి మనుషులతో
మాత్రం సాగానని ఎందుకు పంతం.. ఎక్కిల్లె ఏడుస్తుంటే
కష్టం పోతుందా మరెందుకు గోలా, అయ్యొయ్య పాపం
అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా... "
రాజీ పడటం కన్నా ఉత్తమమైన మార్గం ఇంకొకటి లేదు, దీనినే కొంత మద్ది సర్దుకుపోవడం లేదా అర్ధం చేసుకోవడం అంటారు. అందుకే మనల్ని మనం ప్రశ్నించుకొందాం, మన తప్పులను మనమే సరిదిద్దుకొందాం, మన సమస్యలకు మనమే మార్గం వెతుక్కొందాం. ఒకవేళ మనమే ఇంకొకరికి బదులు ఇవ్వాల్సిన సమయం వస్తే అబద్దం మాత్రం చెప్పకుండా ఉండటమే మంచిది ....
No comments:
Post a Comment