" కులములేల్ల కూలి పోవు..., మతములేల్ల మాసి పోవు
లోకమెల్లా ఏకమై కలిసిపోవు ...." అన్న గురజాడ గుండెకు నేడు గాయం చేస్తున్నారు .....
"తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది...
ప్రాంతాలు వేరుగా ఉన్న మన అంతరంగమొకటేనన్నా... "
అన్న సిరిసిల్ల సినారె మాటలకు నేడు చిన్న చూపు చూస్తున్నారు....
తెలుగు తన వెలుగనుకోని తనువు చాలించిన శ్రీ పొట్టి శ్రీరాముల
ఆశయాలను నేడు తలగోరివి పెడుతున్నారు...
ఆకలేసి కేకలేస్తే కాకులమని ( సీమంధ్రులను )
కూత నేర్చిగానం (తెలంగాణం ) చేస్తే కోకిలని తీర్పు తీర్చిన స్వార్ద రాజకీయ నాయకలు..
పాలకడలిపైన పవ్వళించినవాడికి గొల్ల ఇండ్ల పాలు కోరనేలా ....
ప్రగతి పధంలో ముందున్న హైదరాబాద్ కి ప్రత్యేక రాష్ట్రమిచ్చుటనేలా ....
నెగ్గింది నీతిలేని రాజకీయ నాయకలు....
ఓడింది మాత్రం అమాయక ఆంద్ర ప్రజలు...
అందుకే ....
కలిసిరండి కదలిరండి సమైక్యాంధ్ర కోసం ...
విభేదాలను, భిన్న విధానాలను వదలి
భిన్నత్వంలో ఏకత్వమై, ఏకత్వంలో సమానత్వమై...
సమానత్వంతో సకల జనులు సజ్జనలు వలె కలిసి
ఈ ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం...
మనం సమాఖ్యంధ్రులమని ... స్వార్ధం లేని అన్నదమ్ములమని
Awesome brother ......isn't it just sad :( - Sridevi
ReplyDelete