నింగి నేలలను అడిగా న్యాయమా నీవెక్కడని ...
నవ్వుతుచెప్పాయి... అలాంటి నామమే వినలేదట...
కొండ కోనలకు కబురుపంపి అడిగా...
కలహాలతో కుళ్లిపోయి కంటికి కానరాలేదట...
వాగువంకలతో వంతపాడి అడిగా...
వాన వరదలొచ్చి ఉండలేక వలసపోయిందట...
ఊరుకొని ఉండలేక ఊరూరు వెళ్లి అడిగా...
ఉతలేక ఊబి ఉచ్చులోకి చిక్కికొని పోయిందట...
మనసాగక మనిషి మనిషిని అడిగా...
మంచిమిత్రుడు లేక, తనని కించపరచుకొనలేక మూగపోయిందట..
నాలుగు గోడల మధ్యనున్న న్యాయాన్ని
నాలుగు దిక్కుల మధ్యన నాటేవారెవరు...?
నీతి నీరు పోసి నేలతల్లి ఒడిలో నిలబెట్టేవారెవరు...?
నిజమే న్యాయమెక్కడో?
ReplyDelete